Posts

5 రోజుల్లో టాయిలెట్స్ సమస్యపై విజయం సాధించిన సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ !

Image
2017వ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. నేను మా గ్రామంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండేవాడిని... కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదు... అయినప్పటికీ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని... అటువంటి సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న ప్రజలను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చూడాలని, ప్రతీ జన్మభూమి మీటింగ్ లో ప్రజల తరుపున గ్రామ సమస్యలు మరియు వారి వ్యక్తిగత సమస్యలపై అర్జీలు రాసి అధికారులకు అందిస్తూ ఉండేవాడిని. కొన్ని సమయాల్లో ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యమైతే ప్రభుత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించడంతో కొంతమంది అధికార పార్టీ నాయకులకు నేను వ్యతిరేకిగా మారవలసి వచ్చింది.  ఈ నేపథ్యంలోనే 09/10/2017 నా పుట్టినరోజు. అప్పటికి నాకు 20 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుండి గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలు, గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోస్టింగ్ చేస్తూ ఉండేవాడిని. 2017 అక్టోబర్ నెలలో వర్షాలు అధికంగా కురవడంతో గ్రామానికి తూర్పున ఉ...

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆవిర్భావం...

Image
73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడిన IXవ భాగం లోని 243 ఆర్టికల్ కు అనుగుణంగా దేశమంతటా ఒకే రకమైన పంచాయతీ పాలన ఏర్పాటు చేయబడినది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో కూడా పాత చట్టాల్ని మార్పు చేశారు. ఇంతకుముందు మన రాష్ట్రంలో  ఎ) గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం - 1964. బి) మండల జిల్లా పరిషత్తు లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రణాళిక, అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం -1986. సి) ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంస్కరణల చట్టం 1989 అమలులో ఉండేవి. 73వ రాజ్యాంగ సవరణ తర్వాత ఈ మూడు చట్టాల స్థానంలో కొత్తగా ఒకే చట్టంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ఆమోదం పొంది 3-5-1994 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలో మొత్తం 8 భాగాలలో 278 సెక్షన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994,  8 భాగములు మరియు 278 సెక్షన్లు...    సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ?

Image
గ్రామ స్వరాజ్య స్పూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ గారి మాటలలో గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి ?  1. గ్రామం స్వయంపాలన చేసుకుంటూ గణతంత్ర రాజ్యంగా విలసిల్లడం. 2. తన మౌలిక అవసరాలను తానే తీర్చుకుంటూ ఇరుగుపొరుగు గ్రామాలతో ఇచ్చిపుచ్చుకుంటూ, స్వయం సమృద్ధి సాధించి స్వయం ప్రతిపత్తి గల గ్రామంగా తయారుకావడం. గాంధీజీ సూచించిన రక్షా రేకు (తావీదు) :- ఎప్పుడైనా తనకు, తను అనే స్వార్థం ఎక్కువ అయింది అనిపిస్తే ఈ రకంగా చేయాలి " అత్యంత పేదరికం అనుభవిస్తున్న మరియు బలహీనమైన వ్యక్తి ముఖాన్ని గుర్తు చేసుకో, నీవు చేయబోయే లేదా నీవు తీసుకునే నిర్ణయం వల్ల ఆ వ్యక్తికి ఏమైనా ఉపకరిస్తుందా అని ఆలోచించు. దీని వల్ల ఆ నిరుపేద వ్యక్తికి లాభమా? ఈ నిర్ణయం ఆ వ్యక్తి జీవితాన్ని, అతని అదృష్టాన్ని మారుస్తుందా? ఇంకో మాటలో చెప్పాలంటే నీ నిర్ణయం ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది జీవితాలలో ఆకలి రూపుమాపి ఆధ్యాత్మిక/ ఆత్మ వికాస గ్రామస్వరాజ్యం సాధనకు దారితీస్తుందా?  అలా అయినట్లయితే నీలోని స్వార్థం తనకు తానే మంచులా కరిగి పోయి నీలోని అనుమానాలు పటాపంచలవుతాయి... గ్రామస్వరాజ్యం… మహాత్ముడి స్వప్నం! గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు… గ్ర...

73వ రాజ్యాంగ సవరణ - పంచాయతీ రాజ్ వ్యవస్థ

Image
1993వ సంవత్సరంలో రాజ్యాంగానికి 73వ సవరణ చేయడం ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. తద్వారా రాజ్యాంగంలో పార్ట్ - IX క్రింద ఆర్టికల్ 243 ను పొందుపరిచారు. 1. అధికరణ - 243 :- భారత రాజ్యాంగం 9వ భాగంలో నిర్దేశించిన విధంగా అన్ని రాష్ట్రాలు, మూడంచెల స్థానిక ప్రభుత్వాలను విధిగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మధ్యంతర వ్యవస్థలో మండల ప్రజా పరిషత్ లు, జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ లు.  2. అధికరణ - 243A :- రాష్ట్ర శాసనసభల ద్వార చట్టబద్ధంగా సంక్రమించిన విధులు అధికారాలతో గ్రామసభలు పనిచేస్తాయి. 3. అధికరణ - 243B :- పంచాయతీలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి నిర్వచనం చెప్పబడినది. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలలో మూడు స్థాయిలలో (గ్రామ, మండల, జిల్లా) పంచాయతీ రాజ్ మూడంచెల వ్యవస్థ మరియు కొన్ని చిన్న రాష్ట్రాల్లో రెండు స్థాయిలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు సేకరణ వ్యాసకర్త : నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ గుమ్మఘట్ట మండలం రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లా ఫోన్ నంబర్ : 9346314349

భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు

Image
భారత రాజ్యాంగం ద్వారా వివిధ స్థాయిలలో ఏర్పాటు కాబడిన ప్రభుత్వాలు : 1. కేంద్ర ప్రభుత్వం -  (భారత ప్రభుత్వం) -  ఆర్టికల్ 52 నుండి 151 2. రాష్ట్ర ప్రభుత్వాలు - 28 - ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) - ఆర్టికల్ 152 నుంచి 237 3. కేంద్రపాలిత ప్రాంతాలు - 8 (ఆర్టికల్ 239 నుంచి 242 వరకు) 4. స్థానిక ప్రభుత్వాలు - గ్రామీణ ప్రాంతాలలో :  i. జిల్లాస్థాయి ప్రభుత్వాలు - జిల్లా ప్రజా పరిషత్తు - 13 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } ii. బ్లాకు/ మధ్యస్థాయి మండల ప్రజా పరిషత్తు - 660 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } iii. గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ - 13371 { ఆర్టికల్ 243 - 243 (ఒ) } iv. స్థానిక ప్రభుత్వాలు - పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు - {ఆర్టికల్ 243 (P) నుండి 243 (Z) వరకు } A)  స్థానిక ప్రభుత్వాల ఆవిర్భావం, ఎదుగుదల, మైలురాళ్ళు  : భారత దేశంలో పంచాయతీరాజ్ పరిణామక్రమంలో  ముఖ్యమైన మైలురాళ్ళు.....  i. 1687 మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ii. 1870 పట్టణాలలో స్థానిక సంస్థలపై లార్డ్ మేయో తీర్మానం iii. 1882 స్థానిక స్వపరిపాలన (మున్సిపల్) పై చారిత్రాత్మక తీర్మానం లార్డ్ రిప్పన్ i...

మనదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు

Image
మన దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ముఖ్య లక్షణాలు :  • 18 సంవత్సరాలు నిండిన భారత దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించబడింది. • స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ :   క్రమం తప్పకుండా ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు. • స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించుటకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం. • స్వతంత్ర న్యాయ వ్యవస్థ : రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రజల హక్కులకు స్వతంత్ర న్యాయ వ్యవస్థల ద్వారా రక్షణ కల్పించడం.  • అధికరణ - 40 : భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలన వికేంద్రీకరణ గ్రామస్థాయి వరకు విస్తరింప చేయటం ద్వారా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు.  • పరిపాలన వికేంద్రీకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలకు నిధులు అధికారాలు ప్రభుత్వ వ్యవస్థ ఏర్పాటు చేయడం. • స్థానిక ప్రభుత్వాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా సిఫారసులు.  • ప్రజలందరికీ సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తూనే కొన్ని ప్రత్యేక వర్గాలకు, మహిళలకు ప్రత్యేకమైన హక్కులను కల్పిస్తూ వారి అవకాశాలను పరిరక్షించడం.  • స్థానిక ప్రభుత్వాలు భారత...

భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు

Image
భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనడానికి ఆధారాలు :  ప్రజల కోరికలు, అవసరాల మేరకు ప్రభుత్వాలు పని చేయాలని ఇప్పటికే తెలుసుకున్నాము. మరియు పరిపాలన జనరంజకంగా, చట్టబద్ధంగా జరగడం కోసం మనదేశంలో రాజ్యాంగాన్ని రచించుకొని, ఆమోదించుకుని అమలు చేసుకుంటున్నాము‌.  భారత రాజ్యాంగ స్ఫూర్తిని, లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ పీఠిక అద్దం పడుతుంది‌. మన రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందించబడింది. 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలను ప్రజాస్వామ్యబద్ధంగా నడుపుకోవడానికి రాజ్యాంగంలో 470 ఆర్టికల్స్,  25 భాగాలు, 12 షెడ్యూళ్లతో చట్టపరమైన నియమ నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రభుత్వాలు ఈ నిబంధనల ప్రకారమే ప్రజా పరిపాలన చేయాలి. అలా చేయని పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఈ విధంగా మన దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతూ పరిరక్షించబడుతున్నది  నాయకుల రాజేష్ సిరిగేదొడ్డి గ్రామ పంచాయతీ, గుమ్మఘట్ట మండలం, అనంతపురం జిల్లా, ఫోన్ నంబర్ 9346314349

మన భాతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు

Image
మన భారతదేశంలో వివిధ పరిపాలనా విధానాలు  1. ఆటవిక రాజ్యం :- చట్టబద్దత లేని పాలన అనర్ధదాయకం. ఆ పాలన ప్రజల ఆమోదం లేనిది. అక్కడ ఆటవిక న్యాయం ఉంటుంది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ.   2. సింధూ నాగరికత :- సరస్వతి - సింధూ నాగరికతలో బయలుపడిన పటిష్టకట్టడాలు, శిథిలాలు పరిపాలనకు సంబంధించినవే అని చరిత్రకారులు నిర్ణయించారు. చట్టపరమైన కట్టుబాట్లు, ప్రజల ఆమోదం ఉండవచ్చునని తెలుస్తున్నది.  3. రాచరికం :-  ఆర్యుల కాలంలోనూ, మరియు రాజులైన కనిష్కులు, మౌర్యులు, గుప్తులు, హూణులు మొదలైన వారందరూ "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" మొదలైన ప్రజామోదం పొందిన చట్టబద్ధత కలిగిన పరిపాలన సాగించారు. "సభ" మరియు "సమితి" ప్రజల ఆమోదానికి తార్కాణం. 4. మధ్యయుగ పరిపాలన :- మధ్యయుగ పరిపాలనలో ఆఫ్గాన్ లు, తురుష్కులు, మొఘలులు, పరిపాలించేటప్పుడు "ధర్మశాస్త్రాలు", "ప్రాంతీయ కట్టుబాట్లు", "ఆచార వ్యవహారాలు" కాకుండా ముస్లీం "షారియా" మరియు "ఉలేమాల సలహా"లతో పరిపాలన చేశారు. ఎంత రాజరికపు పరిపాలన అయినా ప్...

గ్రామ పంచాయతీలు - మన స్థానిక ప్రభుత్వాలు

Image
1. ప్రజాస్వామ్యం - ప్రజా పరిపాలన కొరకు ప్రభుత్వాలు  ప్రజాస్వామ్యం : ప్రతీ సమాజంలో చట్టపరమైన పరిపాలనా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చట్టబద్ధత లేని పరిపాలన అనర్ధాలకు దారి తీస్తుంది. ఇలాంటి చట్టబద్ధమైన పరిపాలన అందించుట కొరకు ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉండాలి. గతంలో ఇలాంటి పరిపాలన వ్యవస్థ రాచరికం పద్దతిలో ఉండేది. అందులో రాజును ప్రభువుగా భావించేవారు. రాచరికం అంతరించిన తర్వాత ప్రజా ప్రభుత్వాల వైపు ప్రజలు మొగ్గు చూపారు. ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల కొరకు ప్రజల వలన ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం. కనుక ప్రభుత్వాలు ప్రజల కోరికలు అవసరాల మేరకు పని చేయాలి. కానీ కొన్ని దేశాలలో ఉదాహరణకు ఉత్తర కొరియా లాంటి దేశాలలో ఇప్పటికీ నియంతృత్వ పాలన సాగుతున్నది.  స్వాతంత్రం సాధించినప్పటి నుండి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగానే కొనసాగుతున్నది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను మనదేశంలో ఇలాగే కొనసాగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రజలకు స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సమాన గౌరవం (సామాజిక న్యాయం) ఆర్థిక సాధికారత లభించాలంటే మన దేశం ప్రజాస్వామ్యం దేశంగానే కొనసాగాలి. మన దేశంలో మనం రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట...